దుండిగల్, నవంబర్ 30 : సాంకేతిక టెక్నాలజీతోనే దేశాభివృద్ధి సాధ్యమని, ఇంజినీరింగ్ విద్యార్థులకు ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉందని ఈపీఏఎం సిస్టమ్స్ సీనియర్ రిసోర్స్ డెవలప్మెంట్ మేనేజర్ ఎమ్మాన్యుయెల్ గోసులా అన్నారు. దుండిగల్లోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్(ఎంఎల్ఆర్ఐటీఎం), ఫార్మసీ కళాశాలల్లో బుధవారం ఓరియంటేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మాన్యుయెల్ గోసులా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టెక్ మహేంద్రా వైస్ ప్రెసిడెంట్ నాగార్జున మల్లాడి, టెక్సోల్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శ్రీకాంత్, కళాశాల వ్యవస్థాపక కార్యదర్శి మర్రి రాజశేఖర్రెడ్డి, ఎంఎల్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ కోశాధికారి మమత రెడ్డి, కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, డైరెక్టర్ శ్రేయారెడ్డి, ప్రిన్సిపాల్స్ డా.కె.వెంకటేశ్వర్రెడ్డి, జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ అరుణాభ మల్లిక్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు.