సిటీబ్యూరో,ఆగస్టు 11(నమస్తేతెలంగాణ) : పాతనగరంలో ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు ఫ్లైఓవర్ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఓవైసీ దవాఖాన వద్ద ఇటీవల వంతెన అందుబాటులోకి రాగా, చాంద్రాయణగుట్ట వద్ద ప్రస్తుతమున్న ఫ్లైఓవర్కు అనుబంధంగా రూ.37 కోట్ల వ్యయంతో 390 మీటర్ల పొడవునా మరో వంతెన నిర్మాణం పూర్తి కావొస్తున్నది.
ప్రస్తుతం గ్రీనరీ ఏర్పాటు, లైట్ల బిగింపు పనులు సాగుతుండగా, నెలాఖరులో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ఎల్బీనగర్-శంషాబాద్ ఎయిర్పోర్టు మార్గంలో ప్రయాణం సులువు కానుంది.