బంజారాహిల్స్,ఏప్రిల్ 28: ఐపీఎల్ మ్యాచ్పై(IPL match) ఆన్లైన్లో బెట్టింగ్లకు(Online betting) పాల్పడుతున్న వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్లోని డీజే బార్ వద్ద ఓ వ్యక్తి ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు రాత్రి 9గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకోగా ఓ వ్యక్తి పారిపోయేందుకు యత్నించాడు.
అతడిని పట్టుకుని విచారించగా మస్తాన్ నగర్లో నివాసం ఉంటున్న చెరుకూరి రమేష్(27) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి అని తేలింది. మొబైల్ ఫోన్లో ‘లోటస్247.బెట్’ అనే సైట్లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అతడి వద్దనుంచి రూ.16వేల నగదు, రెండు మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.