సుల్తాన్బజార్, జనవరి 9 : చంచల్గూడ జైలులో ఖైదీగా ఉన్న 21 ఏండ్ల మహమ్మద్ సొహైల్ కడుపులో ఉన్న 8 రకాల మెటల్స్ను ఉస్మానియా దవాఖాన వైద్యులు విజయవంతంగా తొలగించి ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. జైలులో ఉన్న సొహైల్ గత కొంత కాలంగా కడుపు నొప్పితో భాధ పడుతూ ఉండటంతో జైలు అధికారులు ఉస్మానియా దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు.
జనరల్ సర్జరీ విభాగం యూనిట్-7 ప్రొఫెసర్ డాక్టర్ బొంగు రమేశ్ రోగిని పర్యవేక్షించి మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి రిఫర్ చేశారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం హెచ్ఓడీ ప్రొఫెసర్ డాక్టర్ బి.రమేశ్ కుమార్ రోగికి ఎక్స్రే తీయించగా కడుపులో మేకులు, గోర్లు, ప్లాస్టిక్ వస్తువులు, మెటల్ ఉన్నట్లు గుర్తించారు. సుమారు గంట పాటు శ్రమించి ఎండోస్కోపి సహాయంతో వాటిని తొలగించారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకొని ఆరోగ్యం ఉన్నట్లు వైద్యులు తెలిపారు.