వరంగల్ : కరోనా నేపథ్యంలో గణేష్ నవరాత్రులను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు పట్టిష్ట చర్యలు తీసుకుంటున్నారు. గణేష్ నిమజ్జనం జరిగే వరంగల్లోని చిన్న వడ్డేపల్లి చెరువును వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి సందర్శించారు. గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల ప్రతిపాదనలపై చర్చించారు. వారి వెంట వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.