GHMC | సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలోని ఐదు మార్గాల్లో సొరంగ మార్గాల నిర్మాణాలకు సంబంధించిన ఫీజిబిలిటీ స్టడీ, సమగ్ర ప్రాజెక్టు రూపకల్పన (డిటెల్ట్ ప్రాజెక్టు రిపోర్టు) తయారీకి కేవలం ఒకే ఒక సంస్థ ఆసక్తిని చూపింది. గతంలో కేబీఆర్ పార్కు కింద నుంచి సొరంగ మార్గానికి ఫీజిబిలిటీ స్టడీ, డీపీఆర్ తయారీ పనులు పొందిన ఆర్వీ అసోసియేట్స్, అర్కిబెస్ట్ ఇంజినీర్స్ అసోసియేషన్ ముందుకు రాగా.. తాజా టెండర్లో ఆర్వీ మాత్రమే ముందుకు వచ్చింది. కాగా గత నెల ఐదు మార్గాల్లో ఈవోఐ టెండర్ పిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే వచ్చిన ఆర్వీ దరఖాస్తును అధికారులు పరిశీలిస్తున్నారు. ఐతే ఆర్వీ సంస్థకు డీపీఆర్ తయారీ బాధ్యతలు అప్పగిస్తారా? లేదంటే మరోసారి టెండర్ పిలుస్తారా ? అన్నది వేచి చూడాల్సిందే.