సైదాబాద్/చాదర్ఘాట్, అక్టోబర్ 26: విద్యార్థులు పౌష్టికాహారం తీసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ (సీసీఆర్ఎఎస్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్) అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జీపీ ప్రసాద్ అన్నారు. ఆయుర్వేదం దినోత్సవం సందర్భంగా గడ్డి అన్నారంలోని పొట్టి శ్రీరాములు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘ఆయుర్వేద ఫర్ పోషణ’ అనే అంశంపై ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పోషక పదార్ధాల విలువలు, వాటి ప్రాధాన్యతను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని, ఆ దిశగా ప్రతి విద్యార్థి తమ ఆహార పదార్ధాల్లో పోషక విలువలు ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఆయుర్వేద రీసెర్చ్ అసిస్టెంట్ డాక్టర్ సత్యబ్రతానంద మాట్లాడుతూ పౌష్టికాహారం మొక్క ప్రాధాన్యత, పోషక విలువల అవశ్యకతను విద్యార్థులకు వివరించారు. అనంతరం, విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారం, వేరు శనగ నువ్వుల బెల్లం చెక్కీలతో కూడిన ఆహారాన్ని ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ భిశ్వ రంజాన్ దాస్, లైబ్రేరియన్ శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధాయకులు వెంకట్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదిరతులు పాల్గొన్నారు.