ఖైరతాబాద్, ఏప్రిల్ 14 : అనారోగ్యంతో బాధపడుతున్న బలగం మొగిలయ్యకు ప్రవాస భారతీయుడు ఆర్థిక సహకారం అందించారు. మొగిలయ్య నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న విషయాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న హైదరాబాద్ నగరానికి చెందిన ఎన్ఆర్ఐ సంజయ్, అతడి స్నేహితులతో కలిసి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. సుమారు రూ.1.05 లక్షలు నగరంలో ఉంటున్న సంజయ్ తల్లి ఉమాదేవి ఖాతాలో ఆన్లైన్లో పంపించాడు. ఆ మొత్తాన్ని తల్లి ఉమాదేవి శుక్రవారం నిమ్స్ దవాఖానకు చేరుకొని మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆ దంపతులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.