ఖైరతాబాద్, అక్టోబర్ 31: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టికెట్ల అమ్మకం బాగోతాన్ని గిరిజనం గుర్తించాలని టీపీసీసీ ఆదివాసీ విభాగం చైర్మన్ భరత్ చౌహాన్ అన్నారు. గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 30లక్షలకు పైగా గిరిజనుల జనాభా ఉంటే మూడు సీట్లు మాత్రమే కేటాయించారన్నారు.గిరిజనులకు కనీసం 12 శాతం సీట్లు కేటాయించాల్సి ఉందన్నారు. గోండు, ఆదివాసీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న చోట్ల లంబాడీలకు, లంబాడీల జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో గోండులకు టికెట్లు ఇచ్చి ఇరువర్గాల మధ్య రేవంత్ రెడ్డి చిచ్చు పెట్టాడన్నారు.
కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి కేసీఆర్ను చూసి నేర్చుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్లు పెంచడంతో పాటు లంబాడీలకు ఏడు అసెంబ్లీ స్థానాలను కేటాయించిందన్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని గిరిజనులందరూ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గిరిజన సంఘాల జేఏసీ చైర్మన్ అశోక్ రాథోడ్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్, డాక్టర్ రవినాయక్, చంద్రశేఖర్, నాగేంద్ర, లక్పతి తదితరులు పాల్గొన్నారు.