గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు జీడిమెట్లకు చెందిన నిషిత ఆదివారం అబిడ్స్ బస్టాప్లో దిగారు. అయితే ఆమెకు సుల్తాన్బజార్లోని ప్రగతి మహా విద్యాలయంలో సెంటర్ పడింది. అప్పటికే సమయం మించిపోతుండటంతో కంగారుపడుతుండగా, అక్కడే విధులు నిర్వహిస్తున్న కాచిగూడ ఆర్టీసీ డిపో మేనేజర్ రఘు గమనించి.. వివరాలు తెలుసుకున్నారు. తన కారులో ఆమెను సమయానికి పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నిషిత మేనేజర్కు కృతజ్ఞతలు తెలిపారు.
-కాచిగూడ, జూన్ 9