సైదాబాద్, జనవరి 1: మలక్పేట నియోజక వర్గంలో నూతన సంవత్సర వేడుకలు ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. యువత శనివారం అర్ధరాత్రి సందడి చేశారు. ఆదివారం సైదాబాద్ కాలనీలోని బేతేల్ ప్రార్థనా మందిరంలో అధ్యక్షుడు డాక్టర్ పద్మారావు ఆధ్వర్యంలో క్రైస్తవులు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రార్థనలు చేశారు.
అర్ధరాత్రి నుంచి నుంచి ఉదయం వరకు నిర్విరామంగా జరిగాయి. ఐఎస్సదన్ డివిజన్లో పలు కాలనీల్లో సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఏర్పాటు చేసిన వేడుకల్లో యాకుత్పురా బీఆర్ఎస్ నాయకుడు సామ సుందర్రెడ్డి, ఐఎస్ సదన్ డివిజన్ అధ్యక్షుడు మెట్టు భాస్కర్ రెడ్డి, యాకుత్పురా నియోజకవర్గం పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు నల్లిమెల్లి మోజెస్ పాల్గొని కేక్ కట్ చేశారు. పలు కాలనీల్లో స్థానికులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
పరుల క్షేమాన్ని కోరి ప్రార్థనలు చేయటమే క్రైస్తవం
మలక్పేట, జనవరి1 : పరుల క్షేమాన్ని కోరి ప్రార్థనలు చేయటమే క్రైస్తవమని, బేతనీయ బాప్టిస్టు చర్చి పాస్టర్ రెవరెండ్ సామ్యేల్బాబు బైరపోగు, డాక్టర్ శారా రోజ్ సామ్యేల్ బైరపోగు (యూఎస్ఏ) అన్నారు. మూసారాంబాగ్ డివిజన్లోని కృష్ణ తులసీనగర్ బేతనీయ బాప్టిస్టు చర్చిలో ఆదివారం నూతన సంవత్సరం, చర్చి 17వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వారు ప్రార్థనలు నిర్వహించారు. డాక్టర్ శారా రోజ్ సామ్యేల్ బైరపోగు, పాస్టర్ రెవరెండ్ సామ్యేల్బాబు బైరపోగు భక్తులకు సందేశమిచ్చారు. కార్యక్రమంలో పాస్టర్ సైలస్ రేజినాల్డ్ బైరపోగు, చర్చి కార్యదర్శి షీలాడోరతి బైరపోగు, ప్రియాంక, రేచల్, సంఘ కాపరులు, భక్తులు పాల్గొన్నారు.
వాహెద్నగర్ ది పెంతెకోస్థు చర్చిలో
వాహెద్నగర్లోని ది పెంతెకోస్థు చర్చి పాస్టర్ బ్రదర్ శరవణ్ ప్రార్థనలు చేశారు. క్యాలెండర్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో చర్చి సభ్యులు జోసెఫిన్, ప్రభుదాస్, వసంత, ఏనోషు. యబ్బెజ్ హెప్సీభ, జాషువా, జాను, మేరమ్మ, క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి అధ్యక్షులు జెరూషలెం మత్తయ్య పాల్గొన్నారు.
క్రిస్ట్టియన్ లైఫ్ సెంటర్ చర్చిలో..
పాస్టర్ ప్రభుచరణ్, పాస్టర్ ఇమ్మాన్యూయేల్ లక్ష్మీనగర్లోని క్రిస్టియన్ లైఫ్ సెంటర్ చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో సంఘకాపరి ఇమ్మాన్యూల్, భక్తులు పాల్గొన్నారు.