మెహిదీపట్నం, ఏప్రిల్ 12 : చౌరస్తాల్లో వాహనదారులు ఎక్కువసేపు ఆగకుండా వెళ్లడానికి ట్రా ఫిక్ సిగ్నల్స్ పెట్టడానికి టోలిచౌకి ట్రాఫిక్ పోలీసులు శ్రీకారం చుట్టారు. లంగర్హౌస్ టిప్పు ఖా న్ పూల్ బ్రిడ్జి చౌరస్తా, రాందేవ్గూడ చౌరస్తాల్లో ఫ్రిక్ సిగ్నల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా చౌరస్తాల్లో స్తంభాలు పెట్టిన అధికారులు మంగళవారం సిగ్నల్ లైట్లను పెట్టే పనులు ప్రారంభించారు.
ట్రాఫిక్ రద్దీతో కష్టాలు..
లంగర్హౌస్ నుంచి శివారు ప్రాంతాలకు వెళ్లే వారితో రద్దీ పెరుగుతున్నది. శివారు ప్రాంతాల నుంచి లంగర్హౌస్, మెహిదీపట్నంల మీదుగా నగరానికి వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. టిప్పుఖాన్ పూల్ బ్రిడ్జి చౌరస్తా వద్ద రోజూ వాహనాలు ఆగడం ట్రాఫిక్ అర కిలోమీటర్ వరకు జాం అవుతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు తొలుగనున్నాయి.
ప్రజలు సహకరించాలి : శంకర్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్
లంగర్హౌస్ టిప్పుఖాన్ పూల్ బ్రిడ్జి చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ జాం తిప్పలు తప్పుతాయి. ఈ క్రమంలో సిగ్నల్స్ ఏర్పాటు చేసిన కొత్తలో ప్రజలు పోలీసులకు సహకరించాలి. సిగ్నల్స్ నిర్వహణలో ట్రాఫిక్ పోలీసులకు పూర్తి తర్ఫీదు ఇస్తున్నాం.