హైదరాబాద్ : తమ వ్యాపారానికి అడ్డువస్తున్నారని న్యూ మల్టీ కార్ ఓనర్(New multi car owner) తన మనుషులతో అంబులెన్స్ డ్రైవర్లపై(Ambulance drivers) కర్రలతో దాడి(Attacked) చేయించాడు. ఈ సంఘటన ఎల్బీనగర్లో( LB Nagar) గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అంబులెన్స్ డ్రైవర్లు ట్రాఫిక్కి ఇబ్బంది కాకుండా ఎల్బీనగర్లో స్థానికంగా ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్కి అందుబాటులో ఉండాలనే ఆలోచనతో కామినేని చౌరస్తా ఫ్లై ఓవర్ కింద అంబులెన్స్లను గత కొన్నేళ్లుగా పార్క్ చేస్తున్నారు. అయితే అక్కడ అంబులెన్స్ పార్క్ చేయొద్దంటూన్యూ మల్టీ కార్ ఓనర్ డ్రైవర్లతో గొడవకు దిగి వారి పైన దాడి చేయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అంబులెన్స్ డ్రైవర్లపై కర్రలతో దాడి
హైదరాబాద్ – తమ వ్యాపారానికి అడ్డువస్తున్నారని న్యూ మల్టీ కార్ ఓనర్ తన మనుషులతో అంబులెన్స్ డ్రైవర్లను కర్రలతో చితకబాదారు.
అంబులెన్స్ డ్రైవర్లు ట్రాఫిక్కి ఇబ్బంది కాకుండా ఎల్బీనగర్లో స్థానికంగా ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్కి అందుబాటులో ఉండాలని… pic.twitter.com/KOs4yOz3nx
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2024