చిక్కడపల్లి, డిసెంబర్ 24: రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కార్యనిర్వాహక అధికారుల సంఘం (గ్రేడ్-1,2,3) నూతన కార్యవర్గ సమావేశం శనివారం సాయంత్రం చిక్కడపల్లి వివేక్నగర్లోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యనిర్వాహక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా అంజనారెడ్డి, నూతన అధ్యక్షుడిగా నరేందర్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎ.మారుతి, ఉపాధ్యక్షులుగా అంబుజ, శ్రీనివాస్రాజు, లక్ష్మారెడ్డి, సత్యచంద్ర, వేణుగోపాల్, కాంతారెడ్డి, సార శ్రీనివాస్, సతీశ్, ప్రధాన కార్యదర్శి అద్దంకి నాగేశ్వర రావు, రాజేశ్కుమార్, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ శర్మ, స్నేహలత, ఎన్.లావణ్య, ఆంజనేయులు, సుదర్శన్, ప్రచార కార్యదర్శులుగా మహేందర్ గౌడ్, ఎన్.వీరేశం, సతీశ్కుమార్, భాగ్యలక్ష్మి, ఎస్.రవీందర్, కోశాధికారిగా యు.శశిధర్, నరేందర్రెడ్డి, కార్యనిర్వాహక సభ్యులుగా మహేందర్కుమార్, నరేందర్, సత్యానారాయణ, జి.వేణు, పి.వేణుగోపాల్, కె.వేణుగోపాల్, విశ్వనాథ శర్మ, ఉమారాణి, రమేశ్, వెంకట్రెడ్డి ఎన్నికయ్యారు.