సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రోడ్డెక్కిన ప్రజాపాలన పేరుతో నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనం జీహెచ్ఎంసీ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. బాలానగర్ ఫ్లైఓవర్పై అంగడి సరుకులా తరలిస్తున్న దరఖాస్తుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ప్రజా పాలన దరఖాస్తుల తీరు, విధివిధానాలను తప్పుపడుతూనే డేటా చౌర్యానికి ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు.