సైదాబాద్ : కర్నాటక రాష్ట్రంలోని మంగళూర్ పట్టణంలో గురువారం జరిగే జాతీయ ఖోఖో పోటీలకు సైదాబాద్ సింగరేణికాలనీకి చెందిన నేనావతి రాజు ఎంపికయ్యారు. మార్చి 4 న ఉస్మానియా యునివర్సిటీలో జరిగిన నేషనల్ లెవల్ సెలెక్షన్ పోటీల్లో జాతీయ పోటీలకు ఎంపిక అయ్యాడు.
దీంతో ఖోఖో జాతీయ స్థాయి పోటీల్లో తన సత్తాను చాటేందుకు ఖోఖో టీం కోచ్ నర్సింహయాదవ్, సెక్రటరీ సునిల్తో కలిసి 12 మంది ఖోఖో టీం సభ్యులు బుధవారం మంగళూర్కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా నేనావత్ రాజు మాట్లాడుతూ మెరుగైన ఆటను ప్రదర్శించి సత్తాను చాటుతానని, పతాకం సాధించి విజయంతో తిరిగి వస్తామని ధీమా వ్యక్తం చేశాడు.