సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : భారతదేశంలో విద్యావేత్తలు, వివిధ రంగాల్లో ప్రావీణ్యం కలిగిన వారిని గుర్తించి గౌరవించే ప్రతిష్టాత్మక ‘నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ’ (ఎన్డీసీఏ) శ్రీ చైతన్య స్కూల్ను ఉత్తమ పాఠశాలగా, స్కూల్ డైరెక్టర్ను ఉత్తమ డైరెక్టర్గా ఎంపిక చేసింది. ఈ మేరకు బంజారాహిల్స్లోని తాజ్దక్కన్లో శనివారం జాతీయ అవార్డు ప్రధానోత్సవంలో ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సముద్రాల వేణుగోపాలచారి, టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ ప్రతినిధులు బింగి నరేంద్ర గౌడ్, డాక్టర్ విజయ్ కుమార్…బెస్ట్ స్కూల్ ఇన్ ఇండియా, బెస్ట్ అకాడమిక్ డైరెక్టర్ అవార్డులను డైరెక్టర్ సీమకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ చైర్మన్ డాక్టర్ బీఎస్ రావు, చైర్పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి, డైరెక్టర్లు నాగేంద్ర , సుష్మ పాల్గొన్నారు.