సికింద్రాబాద్, అక్టోబర్ 6: సమాజాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తుందని కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. మహారాజ అగ్రసేన్ జయంతి సందర్భంగా బుధవారం సికింద్రాబాద్ బాలంరాయిలోని క్లాసిక్ గార్డెన్స్లో తెలంగాణ అగర్వాల్ సమాజ్ ‘యువ ఫన్ ఫస్ట్’ నిర్వహించింది. వందలాదిమంది మార్వాడి యువతీ యువకులు ఈ ఫస్ట్లో పాల్గొన్నారు. వారు తయారు చేసిన కొన్ని ఉత్పత్తులను అక్కడ ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను నవీన్ మిట్టల్ ప్రారంభించి తిలకించారు.
అనంతరం నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. దేశంలో అపారమైన ప్రతిభ కలిగిన యువతకు కొదవలేదని, వారికి సరైన వనరులు, మార్గదర్శకత్వం మంచి వాతావరణాన్ని అందించడం పాతతరం బాధ్యత అన్నారు. దేశప్రగతిలో యువత క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. పేదరికం, ఆకలి కేకలు, అనారోగ్యరహిత భారత్ నిర్మాణం యువతపైనే ఉందని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు అంజనీ కుమార్ అగర్వాల్, నాయకులు అంకిత్ గుప్తా, ఆశీష్ దోచనీయ, నవీన్ అగర్వాల్, సూర్య కమల్ గుప్తా, సందేశ్ అగర్వాల్, రాహుల్ సింఘాల్, రితీష్ జిగ్నాని, రింకు అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.