హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని లేబర్స్( unorganised workers ) సమస్యల మీద అధ్యయనం చేసి, కార్మికుల బాగు కోసం ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి, వారి సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీని తయారు చేయడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర లేబర్స్ సోషల్ సెక్యూరిటీ బోర్డును ఏర్పరిచింది. ఆ బోర్డు మెంబర్గా ఉద్యమకారుడు, నిజామాబాద్ జిల్లా మోతె గ్రామానికి చెందిన, మోతె గంగారెడ్డి ని నియమించారు. ఈ క్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని గంగారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తనను బోర్డు మెంబర్గా నియమించినందుకు మంత్రికి గంగారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర లేబర్స్ సోషల్ సెక్యూరిటీ బోర్డు పదవీ కాలం మూడు సంవత్సరాలు . ఐఏఎస్ అధికారులు, పారిశామికవేత్తలు, సామాజికవేత్తలు ఉన్న ఈ బోర్డులో.. తెలంగాణ రాష్ట్రంలోని పౌర సమాజం నుంచి ప్రభుత్వంచే నియమింపబడిన ముగ్గురు సభ్యుల్లో గంగారెడ్డి ఒకరు .
ఈ బోర్డు తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం, వారి ఆరోగ్యo విషయంలో, ఇన్సూరెన్స్ విషయంలో, రేషన్ , గృహ సౌకర్యం విషయంలో, వారి పిల్లల చదువు విషయంలో, పని కల్పించిన కంపెనీల నుండి సరియగు జీత భత్యాల విషయంలో తగు చూచనలు చేస్తుంది . వారి సంక్షేమం విషయంలో ఓ పక్కా పాలసీ రూపొందించడంలో.. ఇలా అనేక విషయాల్లో, వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు అందజేస్తుంది.