సుల్తాన్ బజార్, అక్టోబర్ 11: దసరా మహోత్సవాన్ని తలపించేలా వినియోగదారుల కోసం ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ దిన పత్రికలు సంయుక్తంగా నగరవాసుల ముంగిళ్లలోకి ముందస్తుగా మహా వేడుకను తీసుకొచ్చాయి. పది రోజులుగా నగర వినియోగదారుల పెద్ద పండుగ కోలాహలంగా సాగింది. నగర వ్యాప్తంగా వినియోగదారులు ‘దసరా బొనాంజా’ పేరిట గిఫ్ట్ కూపన్లను ఎంజాయ్ చేశారు. ఎన్నో బహుమతులను కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దసరా పండుగ కొనుగోలుదారులకు మరింత చేరువైందని, ప్రతి ఒక్కరూ పండుగ షాపింగ్ను సంతోషంగా చేసేలా షాపింగ్ బొనాంజాను తీర్చిదిద్దినట్లు ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ ఉపాధ్యక్షులు చిరంజీవి పేర్కొన్నారు.
ఈ మేరకు సోమవారం పదో రోజు కోఠిలోని యూనియన్ బ్యాంక్ జోనల్ హెడ్ ఎఫ్జీఎం కార్యాలయంలో నిర్వహించిన దసరా బొనాంజా లక్కీ డ్రా కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఏఫ్జీఎం కబీర్ భట్టాచార్య మూడో విజేతను ఎంపిక చేశారు. ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ ఉపాధ్యక్షులు చిరంజీవి నాల్గో విజేతను ఎంపిక చేయగా, ఐదో విజేతను యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజనల్ హెడ్ మాణిక్యం సూరి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా దిల్సుఖ్నగర్కు చెందిన లత కేఎల్ఎం షాపింగ్ మాల్ ఐదువేల రూపాయల గిఫ్ట్ వోచర్, నాల్గో, ఐదవ విజేతలైన పురుషోత్తం, చరిష్మాలు నిలోఫర్ కేఫ్ గిఫ్ట్ హ్యాంపర్లు గెలుచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఘనంగా జరుపుకునే దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ల ఆధ్వర్యంలో అమ్మకందారులకు, వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు ఈ యేడాది ప్రారంభించిన దసరా షాపింగ్ బొనాంజాకు మంచి ఆదరణ లభించిందన్నారు. ఇందుకు గాను సంస్థలు అందించిన భాగస్వామ్యం అభినందనీయమన్నారు. ఈ ఉత్సాహంతో భవిష్యత్తులో మరింత ఉన్నతంగా కార్యక్రమాలను చేపడుతామన్నారు. ఈ దసరా షాపింగ్ బొనాంజాలో విజేతలైన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
యూనియన్ బ్యాంక్ జోనల్ హెడ్ ఎఫ్జీఎం కబీర్ భట్టాచార్య మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలతో ప్రజలకు షాపింగ్ చేసేందుకు మరింత ఆసక్తి పెరుగుతుందన్నారు. ఈ బొనాంజాలో పది రోజులుగా విజేతలైన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక శుభా కాంక్షలు తెలిపారు. ఇంత మంచి కార్యక్రమంలో తాము భాగస్వాములైనందుకు సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ జోనల్ హెడ్ డీజీఎంలు యోగానంద్, ప్రమోద్ కుమార్ రెడ్డి, డిప్యూటీ రీజనల్ హెడ్ మాణిక్యం సూరి, ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ల అడ్వైర్టెజ్మెంట్ జీఎం ఎన్.సురేందర్ రావు, ఏజీఎంలు సందీప్ జోషి, క్రిష్ణాగౌడ్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో దసరా, బతుకమ్మ పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలకు నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే పత్రికల పాఠకులకు దసరా గిఫ్ట్గా ‘షాపింగ్ బొనాంజా’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాం. ఈ దసరా బొనాంజా విక్రయదారులు, వినియోగదారులకు మరింత చేరువైంది. దసరా పండుగ నేపథ్యంలో షాపింగ్ చేసిన వారికి ఊహించని బహుమతులు రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇలాంటి అవకాశాలను ఎవ్వరూ వదులు కోవద్దు. ప్రతి ఒక్కరూ షాపింగ్ చేసి లక్కీ డ్రాలో విజేతలుగా నిలవాలి.- చిరంజీవి, ఉపాధ్యక్షులు, ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’
బ్యాంకు ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో బృహత్తరమైనది. ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు కలిగిస్తాయి. పది రోజులుగా విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి పండుగ పేరిట ప్రత్యేక శుభాకాంక్షలు. నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే పత్రికల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనాంజాలో మమ్మల్ని భాగస్వాములను చేయడం చాలా సంతోషంగా ఉంది. – కబీర్ భట్టాచార్య, ఎఫ్జీఎం, జోనల్ హెడ్ – యూనియన్ బ్యాంక్