కవాడిగూడ, మే 11: తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన నాయిని నర్సింహారెడ్డి చిరస్మరణీయుడని తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. గురువారం నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ లీగ్-2 టోర్నీకి ఎర్రోళ్ల ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. అంతకు ముందు మాజీ మంత్రి స్వర్గీయ నాయిని నర్సింహారెడ్డి చిత్ర పటానికి ఆయన పూలమాల వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ నాయిని పేరిట క్రికెట్ లీగ్-2ను నిర్వహించడం అభినందనీయమన్నారు.కార్యక్రమంలో నాయిని ఫౌండేష న్ చైర్మన్ వి. సమతారెడ్డి, ఉపాధ్యక్షుడు నాయిని దేవేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వి. శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గోపి, రమేశ్, నేత శ్రీనివాస్, మధు, శివ, శ్యామ్, రజినీకాంత్ గౌడ్, కిరణ్, సాయి యాదవ్, సిద్ద్దిఖ్, కార్తీక్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫైనల్ మ్యాచ్కు మంత్రులకు ఆహ్వానం
శుక్రవారం (నేడు)సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే క్రికెట్ లీగ్-2 ఫైనల్ పోటీల ప్రారంభోత్సవానికి హాజరుకావాలని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్లను నాయిని మెమోరియల్ ఫౌండేషన్ ఉపాధ్య క్షుడు నాయిని దేవేందర్ రెడ్డి కలిసి ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులు ధరించే టీషర్ట్లను మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు.