తెలుగుయూనివర్సిటీ : వైద్య వృత్తిని అనాదిగా ఆచరిస్తున్న నాయీ బ్రాహ్మణులు సామాజిక వైద్యులని బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్నారు. ధన్వంతరి జయంతి ఉత్సవాలు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో గల ఎన్టీఆర్ కళామందిరంలో ధన్వంతరి పరివార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సూర్యపల్లి సారంగపాణి అధ్వక్షతన జరగిన ఈ సభలో నాయిబ్రాహ్మణ కులంలోని ప్రముఖ వైద్యులను, పి.జి, యుజి (అల్లోపతి, ఆయష్, డెంటల్) విద్యార్థులను సత్కరించారు.
ముఖ్య అతిథిగా హాజరైన బీసీ కమీషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు మాట్లాడుతూ ప్రాచీన ఆయుర్వేద వైద్యం సమాజానికి ఎంతో శ్రేయస్కరమని అన్నారు. నాయిబ్రాహ్మణులు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరచుకుంటూ ఐకమత్యంగా సమాజంలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శాంతిరామ్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.ఎం క్రిష్ణారావు తదితరులు పాల్గొన్నారు.