చిక్కడపల్లి, మే 16: కొవిడ్ రోగులను ఆదుకోవడానికి టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు, ముషీబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ తనయుడు ముఠా జైసింహ ముందుకు వచ్చారు. లాక్డౌన్ కాలంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కరోనా రోగులకు ప్రతి రోజు 150 మందికిపైగా ఉచితంగా రెండు పూటలా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని ఆరు డివిజన్లలో కొవిడ్ రోగులను గుర్తించి.. వారికి భోజనం అందిస్తున్నారు. బాధితుల కోసం మీల్ ఫర్ యువర్ ఎమ్మెల్యే పేరిట హెల్ప్లైన్ (నం.76739 59317)ను సోషల్మీడియాలో అందుబాటులో ఉంచారు. ఈ నంబర్ను సంప్రదించిన బాధితులకు సకాలంలో రెండు పూటలా భోజనం పంపిస్తున్నారు.
హెల్ప్లైన్లో సంప్రదించిన కొవిడ్ బాధితులందరికీ పౌష్టికాహారం అందిస్తున్నాం. ముషీరాబాద్ నియోజకవర్గంలో బస్తీలు అధికంగా ఉన్నాయి. అందులో పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. అలాంటి వారికి చేయూతనందిస్తున్నాం. ప్రస్తుతం 20మంది టీంతో రెండు పూటలా భోజనం సరఫరా చేస్తున్నాం. – ముఠా జైసింహ, టీఆర్ఎస్ యువజన విభాగం నేత