చిక్కడపల్లి : బాగ్లింగంపల్లి యాదాద్రి కాలనీలో వక్రతుండ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో స్వామి వారి లడ్డూ వేలం కార్యక్రమం జరిగింది. వేలంలో రూ.72,500లకు అదే కాలనీకి చెందిన ముస్లిం సోదరుడు ముస్తఫా కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కలుకూరి రాజు, సాయి కిషోర్, సతీష్ బాబు, దేవ్ సింగ్, అరుణ్,శివాజీ రావు, ప్రమోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.