హైదరాబాద్: కూల్చివేతల విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గడంలేదు. మూసీ (Musi River) సుందరీకరణలో భాగంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు అధికారులు సిద్ధమయ్యారు. మొదటి విడతలో పునరావాస కేంద్రాలకు తరలించిన వారి ఇండ్లను మరికాసేపట్లో నేలమట్టం చేయనున్నారు. ఇప్పటికే చాదర్ఘాల్లో రెడ్మార్క్ చేసిన ఇండ్లకు రెవెన్యూ అధికారులు సీల్ వేశారు. చాదర్ఘాట్ పరిసరాల్లో 20 ఇండ్లకు ఆర్బీ-ఎక్స్ మార్కింగ్ చేసి నిర్వాసితులను తరలించిన విషయం తెలిసిందే. మూసానగర్, రసూల్పుర, వినాయక్నగర్లో కూల్చివేతలు జరుగనున్నాయి.
లక్షన్నర ఇండ్లకు మార్కింగ్..
మూసీ డెవలప్మెంట్ అలైన్మెంట్ మ్యాప్ అందుబాటులోకి రాక ముందు… మూసీకి ఇరువైపులా రివర్ బెడ్ పరిధిలో ఉన్న నిర్మాణాల సంఖ్య దాదాపు 30 నుంచి 40వేల మధ్య ఉంటుందని భావించారు. కానీ ప్రస్తుత మ్యాప్ ప్రకారం రివర్ బెడ్(రెడ్ లైన్) పరిధిలో వచ్చే నిర్మాణాల సంఖ్య 60 నుంచి 70వేలకు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఎఫ్ఆర్ఎల్(బ్లూ లైన్) పరిధిలోకి వచ్చే ఆస్తుల సంఖ్య దాదాపు లక్షకు పైగానే ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఒక్కో చోట ఎఫ్ఆర్ఎల్ వెడల్పు 80 నుంచి 100 మీటర్ల దూరంలోనే ఉండగా… దీనికి అదనంగా బఫర్ జోన్ నిర్దారించాల్సి ఉంటుంది. మూసీ ప్రక్షాళన పేరిట ఈ లెక్కన ప్రభుత్వం దాదాపు లక్షన్నరకు పైగా నిర్మాణాలను సుందరీకరణ పేరిట మూసీలో ముంచేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
హద్దుల కోసం ప్రత్యేక మ్యాప్..
మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు మూడు నెలల్లోనే అంచనా వ్యయా న్ని రూ.లక్షన్నర కోట్లకు పెంచేసి.. మూసీ బ్యూటిఫికేషన్ కాంగ్రెస్కు ఏటీఎంలా మారనుందనే విమర్శలతో పౌర సమాజం గళమెత్తింది. దీనికోసం రెవె న్యూ, ఇరిగేషన్, జియో మ్యాపింగ్ అధ్యయన సంస్థలతో కలిసి మ్యాప్ను రూపొందించిందని ఎంఆర్డీసీఎల్ వర్గాలు వెల్లడించాయి.