కవాడిగూడ/చిక్కడపల్లి, నవంబర్ 25: వచ్చే ఏడాది జూన్ నెలాఖరుకల్లా స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం లోయర్ ట్యాంక్బండ్ రామకృష్ణా మఠం శ్రీ విజయ గణపతి దేవాలయం నుంచి ఆర్టీసీ క్రాస్రోడ్డు, వీఎస్టీ, నాగమయ్య కుంట వరకు రూ.426 కోట్ల వ్యయంతో నిర్మించే స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎస్ఆర్డీపీ ప్రాజెక్ట్ నార్త్జోన్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ గోపాల్, డీఈలు సుదర్శన్, రేణుక, ఏఈలు సాయికృష్ణ, ప్రశాంత్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ హెచ్ఎం రాధాకృష్ణ తదితరులతో కలిసి పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ పనుల తీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. దేశంలోనే ద బెస్ట్ స్టీల్ బ్రిడ్జ్గా అత్యంత నాణ్య త ప్రమాణాలతో ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు జరుగుతున్నాయని, స్టీల్ బ్రిడ్జి మొత్తం 2.63 కిలోమీటర్ల వరకు మొత్తం 81 పిల్లర్లల ద్వారా ఈ నిర్మాణం జరుగుతుందని, ఇప్పటి వరకు 74 పిల్లర్లు పూర్తిగా నిర్మాణం జరిగాయని తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణం ఫిబ్రవరిలోగా పూర్తవుతాయని అనుకున్నామని, హైటెన్షన్ వైర్లను తొలగించి అండర్గ్రౌండ్ ద్వారా కేబుల్ వైర్లను వేయడం వల్ల కొంత ఆలస్యం అయ్యిందని ఆయన అన్నారు. వచ్చే ఏడాది జూన్ నెలాఖరులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ స్టీల్ బ్రిడ్జి దేశంలోనే అత్యంత గుర్తింపునిచ్చే విధంగా నిర్మాణం జరుగుతుందన్నారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యుజవన విభాగం నాయకుడు ముఠా జయసింహ, కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎన్డీ సాయికృష్ణ, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, రాంచందర్, రాజశేఖర్ గౌడ్, ప్రభాకర్ ముఠా శివసింహ, ఎం.బి కృష్ణ, శ్రీధర్రెడ్డి, సి.హెచ్ హన్మంతు, భాస్కర్రెడ్డి, వెంకటేశ్, పద్మ, తుడుం లక్ష్మి, రాంనగర్ డివిజన్ నాయకులు ఎం.వి జనార్దన్, ఆర్.జయదేవ్, శివకుమార్ యాదవ్, జనార్దన్, నితిన్, రూపుల సంతోష్ పాల్గొన్నారు.
చేపల మార్కెట్ను ఆధునీకరిస్తాం
ముషీరాబాద్, నవంబర్ 25: ముషీరాబాద్ చేపల మార్కెట్ను సకల సౌకర్యాలతో ఆధునీకరించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. పారిశుధ్య సమస్య తలెత్తకుండా, ప్రజలు సౌకర్యంగా ఉండేలా ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. శనివారం ఆయన ముషీరాబాద్ చేపల మార్కెట్ను పరిశీలించి, మార్కెట్లో పారిశుధ్యం, సౌకర్యాల తీరును వాకబు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మార్కెట్లో చేపల కటింగ్ కోసం ప్రత్యేక పుట్పాత్, వ్యర్థాల తొలగింపు, మురుగు నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మార్కెట్పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి అవసరమైన చేయూతనందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దీన్దయాల్ రెడ్డి, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.