వినాయక్నగర్, జూన్ 24: ఆర్థిక ఇబ్బందులతో ఓ వృద్ధురాలిని హత్య చేశాడు. ఆపై ఆమె కాళ్లు, చేతులను వైరుతో కట్టేసి బాత్రూంలో పడేశాడు.. ఆమె ఒంటిపై ఉన్న బంగారు గాజులను తీసుకొని.. ఓఫైనాన్స్లో కుదువపెట్టి డబ్బు తీసుకుని పరారయ్యాడు. ఈ సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యసాయి ఎన్క్లేవ్లో మంగతయారు (72) నివసిస్తున్నది. భర్త చెంచయ్య కొన్నేండ్ల కిందట మరణించాడు. వీరికి ఇద్దరు కుమారులు, కూతురు. ఒక కుమారుడు ఢిల్లీలో సైన్యంలో కల్నల్గా, మరొకరు అమెరికాలో, కూతురు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ నగరంలో ఉంటుంది. ఒంటరిగా ఉంటున్న మంగతయారు.. రెండంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో ఉంటూ… కింది పోర్షన్తో పాటు రెండవ అంతస్తులోని రెండు పోర్షన్లను అద్దెకు ఇచ్చింది. పై పోర్షన్లో రాజేశ్గౌడ్(34), భార్యతో కలిసి ఉంటున్నాడు. బెంగళూర్లోని సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నట్లు చెప్పాడు. కొన్ని నెలలుగా రాజేశ్గౌడ్కు భార్యతో తరచూ గొడవ జరుగుతుంది. దీంతో మంగతయారు తరచూ వారిద్దరికి సర్దిచెప్పేది. వారం కిందట రాజేశ్గౌడ్ భార్య పుట్టింటికి వెళ్లింది.
రాజేశ్ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు.. వాటి నుంచి బయటపడానికి ఒంటరిగా ఉన్న మంగతయారును హత్యచేసి.. ఆమెపై ఉన్న నగలు, డబ్బు తీసుకోవాలని పథకం పన్నాడు.. బుధవారం మధ్యా హ్నం మంగతయారు ఇంటిపైన ఉన్న చెట్లకు నీళ్లు పోయడానికి వెళ్లిం ది. పక్కింట్లోవారు కూడా లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన రాజేశ్.. పైకి వెళ్లి మంగతయారును తన పోర్షన్ వద్దకు తీసుకొచ్చాడు. తాము ఇంటి విషయమై గొడవపడితే తన భార్యకు మద్దతు ఇస్తున్నావని ఆమెతో గొడవ పడి..తోసేయగా కిందపడి తలకు గాయాలయ్యా యి. వెంటనే నోట్లో గుడ్డలు కుక్కి వైర్తో గొంతుకు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె చేతులు, కాళ్లను వైర్తో కట్టేసి బాత్రూంలో పడేశాడు. ఆమె చేతులకు ఉన్న నాలుగు బంగారు గాజులను తీసుకుని స్థానికంగా ఉన్న ఫైనాన్స్లో కుదువపెట్టాడు.
కాగా.. నగరంలో ఉన్న కూతురు ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. ఇంటికి వచ్చి చూడగా తాళంవేసి ఉంది. సెల్ ఫోన్ స్విచాఫ్ చేసిఉంది. రాత్రి వరకు తల్లి కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు ఆమె ఇంటికి వచ్చి ఇంటి తాళం పగులగొట్టి లోపల చూసినా ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదు. భవనం చుట్టూ వెతికి.. పై అంతస్తులో ఉంటున్న రాజేశ్గౌడ్ ఇంట్లో వెతికారు. అనుమానంతో బాత్రూం తెరిచి చూడగా మంగతయారు మృతదేహం కనిపించింది.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నిందితుడు రాజేశ్గౌడ్ పరారీలో ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.