మియాపూర్,జనవరి 8: హిందువులు జరుపుకునే సంక్రాంతి ముగ్గుల సంబురాలను మైనార్టీ నేతలు నిర్వహించటం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మత సామరస్యాన్ని ప్రతిబింబించే సంక్రాంతి ముగ్గులు అందిరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జన్మభూమి కాలనీలో ఆదివారం ముగ్గుల పోటీలను కార్పొరేటర్లు వెంకటేశ్ గౌడ్, శ్రీనివాస్రావులతో కలిసి విప్ గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. సంక్రాంతి సంబురాలలో ముస్లింలు భాగస్వాములు కావటం అభినందనీయమని, ఈ సంప్రదాయం అందరికీ ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సమద్, ఎంఏ కరీం, షౌకత్ అలీ, షేక్ గౌస్, బడేఖాజా, గౌస్, ఫెరోజ్, గౌసుద్దీన్, శిరీష, రాజ్యలక్ష్మి, మధులత, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
చిరు ధాన్యాలపై అవగాహన..
రైతు నేస్తం ఫౌండేషన్ సహకారంతో కర్ణక సేవా కేంద్రం ఆధ్వర్యంలో హైదర్నగర్ డివిజన్ సమతానగర్లో చిరు ధాన్యాలపై అవగాహన కార్యక్రమంలో డాక్టర్ ఖాదర్ వలీ, కార్పొరేటర్ శ్రీనివాస్రావు, మిల్లెట్ రాంబాబు, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వర్రావు లతో కలిసి విప్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. ప్రజారోగ్యంపై జీవన శైలితో పాటు ఆహారపు అలవాట్లు తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. ఆరోగ్యకరమైన రోజువారీ జీవనశైలి, తగు శక్తినిచ్చే తృణ ధాన్యాలను తీసుకోవటం ద్వారా శరీరానికి మంచి పోషకాలు అంది సత్ఫలితాలుంటాయన్నారు. ఈ దిశగా ప్రజలలో తగు అవగాహన కల్పిస్తున్న రైతు నేస్తం, ఖాదర్ వలీ సహా శాస్త్రవేత్తలను విప్ గాంధీ అభినందించారు.
డివిజన్ పరిధిలోని వివేకానందనగర్ అపార్టుమెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అదనపు గదులను కార్పొరేటర్ రోజాదేవితో కలిసి విప్ గాంధీ ప్రారంభించారు. కాలనీవాసుల సౌకర్యం కోసం వాటి నిర్మాణం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు సంజీవరెడ్డి, భాస్కర్రావు, చంద్రకాంత్రావు, రాంచందర్, అసోసియేషన్ ప్రతినిధులు వాసుదేవరావు, వెంకట్రావు, శ్రీనివాస్లు, చెన్నాలు, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.
చందానాయక్ తండాలో ఉచిత వైద్య శిబిరం
మాదాపూర్, జనవరి 8: మాదాపూర్ డివిజన్ పరిధిలోని చందానాయక్ తండాలో అగర్వాల్ సమాజ్ దుర్గం చెరువు శాఖ, అగర్వాల్ సేవదళ్, బద్రావిశాల్ పన్నలాల్ పిట్టి ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మెడికవర్ దవాఖాన సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ విచ్చేసి హైదర్నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్లతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చిన్న మధుసూధన్రెడ్డి, లాలూనాయక్, ఉన్యా నాయక్, బాలు, రాజశేఖర్, అగర్వాల్ సమాజ్ దుర్గం చెరువు శాఖ అధ్యక్షుడు సురేశ్ మిట్టల్, వైస్ ప్రెసిడెంట్ హేమంత్ గుప్తా తదితరులు ఉన్నారు.