ఉస్మానియా యూనివర్సిటీ/నేరేడ్మెట్/గౌతంనగర్/ వినాయక్నగర్, జూలై 3: పట్టణ రూపురేఖలను మార్చి, ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని సూచించారు. కలిసికట్టుగా ముందడుగు వేసి చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఏడో విడత హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. తార్నాక డివిజన్లో శనివారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డితో కలిసి డిప్యూటీ మేయర్ పాల్గొని మాట్లాడుతూ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలన్నారు. మన చేతిలోనే మన నగరం ఉందని, దానిని సుందరంగా ఉంచుకుందామని పిలుపునిచ్చారు.
ఉస్మానియా యూనివర్సిటీలో వారం రోజుల హరితహారం కార్యక్రమాన్ని ఓయూ వీసీ ప్రొఫెసర్ డి. రవీందర్ శనివారం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులందరూ ఒక్కో మొక్కను నాటడంతో పాటు దానిని సంరక్షించేందుకు రూ. వెయ్యి విరాళంగా అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యానాయక్, ఆర్ట్స్ కళాశాల ప్రినిపాల్ ప్రొఫెసర్ సి. గణేశ్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అనుపమ్మ, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. రాములు, ప్రోగ్రాం ఆఫీసర్ బాలునాయక్ పాల్గొన్నారు.
పట్టణాల రూపురేఖలు మార్చడం కోసం సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు నేరేడ్మెట్ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా అన్నారు. మధురానగర్లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి ఉపేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, గోకుల్, శ్రీనివాస్రావు, చెన్నారెడ్డి, శివ, మధు, మహాత్య, యాది, నరేశ్, రఘుపతిరెడ్డి , రమేశ్, రాజు పాల్గొన్నారు.
డివిజన్లో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని కార్పొరేటర్ గున్నాల సునీతా చంద్రశేఖర్ అన్నారు. శనివారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీకాలనీలో పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకొని వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అభివృద్ధి పనుల్లో అందరూ భాగస్వాములులు కావాలని కార్పొరేటర్ శాంతి అన్నారు. శనివారం అల్వాల్, వెంకటాపురం, మచ్చ బొల్లారం డివిజన్లలోని పలు కాలనీల్లో పట్టణ ప్రగతి పథకంలో డీసీ నాగమణి, కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్, రాజ్ జితేంద్రనాథ్, ఏఎంహెచ్వో నిర్మలతో కలిసి పారిశుద్ధ్య పనులతో పాటు డ్రైనేజీ కాలువలను పరిశీలించారు. కార్యక్రమంలో కవిత, ప్రవీణ్, అరవింద్, అశ్విన్, జనార్దన్, శివ పాల్గొన్నారు.
ప్రజల అభివృద్ధి కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమం అని కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి అన్నారు. శనివారం వినాయక్నగర్ డివిజన్లోని నవభారత్ హౌసింగ్ కాలనీలో పారిశుద్ధ్యం, రోడ్లు, విద్యుత్తో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్ని కార్పొరేటర్ తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఓంప్రకాశ్, ప్రధాన కార్యదర్శి మణిరత్నం, శ్రీకాంత్యాదవ్, సాయిసురేశ్ పాల్గొన్నారు.