కొండాపూర్, ఫిబ్రవరి 16 : నెలలు గడుస్తున్నా.. జీతాలిస్తలేరంటూ.. శుక్రవారం కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ విభాగం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. డిసెంబర్, జనవరి వరకు జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వాపోయారు. కొంతకాలంగా కాంట్రాక్టర్ల ఆగడాలు ఎక్కువయ్యాయని, ఉద్యోగులకు ఉండే సీఎల్లను సైతం వినియోగించుకోకుండా ఇబ్బంది పెడుతున్నట్లు తెలిపారు.
జీతాలిచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఆందోళనలో సిబ్బంది శ్రవణ్ యాదవ్, రాజు, భాగ్య, మల్లేశ్వరి, అనిత, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.