సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఆదివారం (18న) 34 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. ఇందులో లింగంపల్లి-హైదరాబాద్ స్టేషన్ పరిధిలో 18 సర్వీసులు, ఫలక్నుమా-లింగంపల్లి స్టేషన్ల పరిధిలో 14 సర్వీసులతో పాటు సికింద్రాబాద్-లింగంపల్లి స్టేషన్ల పరిధిలో 2 చొప్పున మొత్తం 34 సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.