సైదాబాద్, ఆగస్టు 16 : దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్న సందర్భంగా హుజూరాబాద్ సభకు నేతలు తరలివెళ్లారు. డివిజన్ నుంచి బయలు దేరిన బస్సును హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొరుడు భూమేశ్వర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులకు దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. ప్రభుత్వ ఫలాలు పొందిన ప్రజలందరూ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలుపించుకోవటం ఖాయమన్నారు. యాకుత్పురా నియోజక వర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి సామ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల టీఆర్ఎస్ నాయకులు బస్సులో హుజూరాబాద్ సభకు తరలివెళ్లారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కావేటి ధర్మరాజు, రఘు, శ్రీధర్ పాల్గొన్నారు.
అబిడ్స్, ఆగస్టు 16 : హుజూరాబాద్లో ముఖ్యమంత్రి బహిరంగ సభకు గోషామహల్ నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు.
మెహిదీపట్నం, ఆగస్టు 16 : దళిత బంధు పథకం అద్భుతం అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, నాంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి సీహెచ్.ఆనంద్కుమార్గౌడ్ అన్నారు.
చాంద్రాయణగుట్ట, ఆగస్టు 16 : దళిత బంధు పథకం ప్రారంభం సందర్భంగా హుజూరాబాద్లో సీఎం కేసీఆర్ సభకు చాంద్రాయణగుట్ట నియోజకవర్గం ఇన్చార్జి ముప్పిడి సీతారాంరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ ఒక్క కేసీఆర్తోనే సాధ్యమన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయన్నారు.