మణికొండ, జూలై 16 : మణికొండ మున్సిపాలిటీలో బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తో పాటు ఎమ్మెల్సీ బండప్రకాశ్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ రామకృష్ణారెడ్డి, పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు, మాజీ ఎంపీపీ మల్లేశ్, బీఆర్ఎస్వీ కన్వీనర్ శ్రావణ్కుమార్ పాల్గొన్నారు.
మణికొండ మున్సిపాలిటీ పరిధిలో..
మణికొండ: నార్సింగి,మణికొండ మున్సిపాలిటీల పరిధిలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో కోకాపేట, మంచిరేవుల, గండిపేట, మణికొండ మున్సిపాలిటీలో మణికొండ, నెక్నాంపూర్, పుప్పాగూడలో బోనాలు నిర్వహించారు. మణికొండ పోచమ్మతల్లి దేవాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్లీడర్ రామకృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ నరేందర్రెడ్డి, కౌన్సిలర్లు కావ్య, శైలజ, శ్వేతారెడ్డి,వందనలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పుప్పాలగూడ అమ్మవారి దేవాలయాల వద్ద మున్సిపల్ చైర్మన్ నరేందర్, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, మీనా ముత్యాలు, పద్మారావు, పురుషోత్తం, గ్రామ పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.నెక్నాంపూర్ గ్రామంలో నల్లపోచమ్మ దేవాలయం, ఎల్లమ్మ, సౌడమ్మ ఆలయాల భక్తులు బోనాలను అమ్మవారికి సమర్పించారు. చిత్రపురికాలనీలో సంక్షేమ సంఘం అధ్యక్షుడు వల్లభనేని అనిల్కుమార్ మొదటిబోనం సమర్పించి ఉత్సవాలను నిర్వహించారు. కోకాపేటలో కౌన్సిలర్లు శివారెడ్డి, దుర్గేశ్యాదవ్, విజయ్కుమార్,ఆదిత్యారెడ్డి దగ్గరుండి ఆయా ప్రాంతాలలో అమ్మవారి ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. మంచిరేవులలో కౌన్సిలర్లు నాగపూర్ణ శ్రీనివాస్, పద్మావీరారెడ్డి, నరేశ్ బోనాల ఏర్పాట్లను సమీక్షించారు. నార్సింగి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రవీణ్యాదవ్, వేణుగోపాలస్వామి ఆలయ చైర్మన్ పొన్న రమేశ్ ఏర్పాట్లను చేపట్టి ఉత్సవాలను నిర్వహించారు.
మైలార్దేవ్పల్లి డివిజన్లో…
మైలార్దేవ్పల్లి ,జూలై16: అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ కోరుకున్నట్లు తెలిపారు. మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని మధుబన్ కాలనీ,గణేశ్ నగర్ ,కాటేదాన్ ,పద్మశాలిపురం ,మార్కండేయనగర్ ,బాబుల్ రెడ్డినగర్ ప్రాంతాల్లోని ఉన్న పోచమ్మ దేవాలయాల్లో బోనాలు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రకమంలో డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్గౌడ్ ,మధుబన్ కాలనీ అధ్యక్షుడు డీవీ కుమార్ , పోచమ్మ దేవాలయ కమిటీ అధ్యక్షుడు మహేశ్ ,పద్మశాలిపురం ఆలయ కమిటీ అధ్యక్షుడు కాశీగారి యాదగిరి,విజయ్కుమార్ ,సామల సతీశ్కుమార్, నాని,అర్జున్ ,ప్రసాద్ ,ప్రవీణ్ ,రాఘవేందర్ పాల్గొన్నారు.
అత్తాపూర్లో..
అత్తాపూర్, జూలై 16: రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని అత్తాపూర్ లో పోచమ్మ దేవాలయంలో ఎమ్మెల్యేప్రకాశ్గౌడ్ బోనం ఎత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో జీవనం సాగించాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పూజల్లో పాల్గొన్న కార్పొరేటర్…
బండ్లగూడ,జూలై 16: రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లి,బండ్లగూడ,హిమాయత్సాగర్,కిస్మత్పూర్,హైదర్షాకోట్,పీరం చెరువు తదితర ప్రాంతాలలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. పలు ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు,నాయకులు పాల్గొని సందడి చేశారు. కార్పొరేటర్ పద్మావతి పాపయ్య యాదవ్ పద్మశ్రీహిల్స్లోని పోచమ్మ దేవాలయంలో బోనాల పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.
శంషాబాద్ మండలంలో..
శంషాబాద్ రూరల్, జూలై 16 : బోనాల ఉత్సవాలు శంషాబాద్ మండలంలోని నర్కూడ, కాచారం గ్రామాలలో వైభవంగా నిర్వహించారు. నర్కూడలో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో శంషాబాద్ జడ్పీటీసీ నీరటి తన్విరాజు స్వయంగా బోనం ఎత్తుకొని అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించారు. ఉదయం నుంచి గ్రామాలలో బోనాల ఉత్సవాలలో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో వచ్చి అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సునిగంటి సిద్ధులు, ఎంపీటీసీ గౌతమి, డీసీసీబీ డైరెక్టర్ బూర్కుంట సతీశ్, బీఆర్ఎస్ నాయకులు నీరటి రాజుముదిరాజ్,విశ్వనాథం, నీరటి శేఖర్,శ్రీనివాస్, అశోక్ముదిరాజ్,మహేశ్ముదిరాజ్,శివాజీ,గణేశ్,వార్డు సభ్యులు కుమార్గౌడ్, యాదగిరి, బుక్కా వేణుగోపాల్, బుర్కుంట గోపాల్, నాగేశ్, సంజీవ,భాస్కర్లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.