హైదరాబాద్ : విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా రాణించాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. సనత్ నగర్లోని స్పోర్ట్స్ గ్రౌండ్లో ఆర్ఎస్ఎంఏ ఆధ్వర్యంలో యానువల్ స్పోర్ట్స్ మీట్(Annual Sports Meet)ను ప్రారంభించారు. స్పోర్ట్స్ మీట్లో విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
విద్యార్థులను మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులదన్నారు. స్ట్రెస్ నుంచి విద్యార్థులు రిలాక్స్ కావడానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని స్పష్టం చేశారు. విద్యార్థులు సెల్ ఫోన్ల (Cell phones)కు దూరంగా ఉండాలని సూచించారు. తమ సమయాన్ని వృథా చేసుకోకుండా లక్ష్యంపై దృష్టి పెట్టాలన్నారు.