వనస్థలిపురం, సెప్టెంబర్ 17: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ వనస్థలిపురంలో ఆయన అభిమానులు ఆదివారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. వనస్థలిపురంలోని పలు ప్రధాన రహదారుల మీదుగా ర్యాలీ నిర్వహించి, పనామా చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు.
అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహిస్తుండటంతో పోలీసులు అడ్డుకొని, నిర్వాహకులను అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పనామా చౌరస్తా వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు 10 నిమిషాలు అనుమతివ్వాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. వారికి మద్దతు తెలిపి వెళ్లారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, అనిల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.