హైదరాబాద్ : గడ్డిఅన్నారం(Gaddi annaram) పండ్ల మార్కెట్ స్థానంలో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్(Tims Hospital)ను నాణ్యతా ప్రమాణాలతో అత్యుత్తమంగా నిర్మించాలని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి(MLA Sudhir Reddy) అధికారులకు సూచించారు. బుధవారం కొత్తపేటలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థానంలో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్ను పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిమ్స్ దవాఖానలో 26 అంతస్తులతో నిర్మించనున్నామన్నారు.
ప్రస్తుత, భవిష్యత్తు తరాల వారిని దృష్టిలో పెట్టుకుని గతంలోనే కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చి దవాఖాన నిర్మాణంతో పాటు పోలీస్ స్టేషన్, రిజర్వాయర్, పార్కు, సబ్స్టేషన్, వాటర్ రిజర్వాయర్ల నిర్మాణం కోసం కూడా ఒప్పించామన్నారు. గడ్డిఅన్నారం, చైతన్యపురి డివిజన్ల ప్రాంతాల్లో స్థలాలు అందుబాటులో లేనందున మార్కెట్ స్థలంలోనే అన్ని విభాగాలకు స్థలాలు కేటాయించేలా చొరవ తీసుకున్నామన్నారు.
వైద్య శాల ప్రాంగణంలో దేవాలయంతో పాటుగా మజీద్ను కూడా నిర్మాణం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్రెడ్డి, నాయకులు చంద్రశేఖర్రెడ్డి, రామకృష్ణ , అధికారులు సుభాష్, రాజు, ఆశాజ్యోతి, పద్మాకర్, భాస్కర్రెడ్డి, సంతోష్, కుమార్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.