ఎల్బీనగర్, ఫిబ్రవరి 22 : నియోజకవర్గం పరిధిలో భూ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన జీవో నం.118లో కొన్ని సవరణలు చేయాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్మిట్టల్ను ఎంఆర్డీసీఎల్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి కోరారు. నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న రిజిస్ట్రేషన్ సమస్యల పై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జీవో నంబర్ 118 ప్రకారం సమస్యలు పరిష్కారమవుతాయని వెల్లడించిన విషయం తెలిసిందే.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని బుధవారం కలిసి ఎమ్మెల్యే సుధీర్రెడ్డి జీవో నం.118 సవరణపై చర్చించారు. ఓపెన్ ప్లాట్లు, నోటరీ ప్లాట్లు ఉన్నవారు, వాటిలో ఇల్లు కొన్న వారికి రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశం కల్పించాలన్నారు. విదేశాల్లో ఉన్న వారికి కూడా ఆన్లైన్లో గాని, వారి బంధువుల ద్వారా కానీ రిజిస్ట్రేషన్కు అనుమతివ్వాలని ఎమ్మెల్యే కోరారు. లీగలైజేషన్ ఉన్న వాళ్లు కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వడానికి ఆప్షన్ ఇవ్వాలని వివరించారు. త్వరలోనే సంబంధిత రెవెన్యూ అధికారులు ఇంటింటికీ వచ్చి సర్వే చేస్తారని నవీన్ మిట్టల్ తెలిపినట్లు చెప్పారు.