మన్సూరాబాద్/వనస్థలిపురం/హయత్నగర్/చంపాపేట, మార్చి 7: వరదలు, కరోనాతో ప్రజలు పోరాడుతుంటే ఏనాడు ఎల్బీనగర్ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావుకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి మద్దతుగా ఆదివారం మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి ఆధ్వర్యంలో మన్సూరాబాద్ డివిజన్లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో పట్టభద్రులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, బేవరేజెస్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ దేవిప్రసాద్, రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై గత ఆరు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి ఓటు వేయాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. విద్యావంతురాలైన సురభి వాణీదేవి విద్యా సంస్థలను నెలకొల్పి ఎంతో మంది విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దారని తెలిపారు. విద్యా వ్యవస్థలలో నెలకొన్న సమస్యలతో పాటు విద్యార్థుల ఇబ్బందులు తెలిసిన వ్యక్తి శాసనమండలిలో ఉంటే వారి పక్షనా ఆమె గొంతు వినిపించే అవకాశం ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గితే దేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గాలి.. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో అందుకు భిన్నంగా జరుగుతుంది.
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతుంటే మన దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. ధరల పెంపుపై నిరసన తెలిపేవారి పట్ల కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ నియంతృత్వ పోకడాలకు పోతుందని ఆయన అన్నారు. ప్రశ్నించే వారిపై ఇన్కంటాక్స్ దాడులు నిర్వహింపజేస్తూ ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతున్న బీజేపీకి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. ఈనెల 14న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, మాజీ అధ్యక్షులు చుక్కమెట్టు శ్రీకాంత్రెడ్డి, పోచబోయిన జగదీశ్యాదవ్, నాయకులు దుర్గెంపూడి సాంబిరెడ్డి, రుద్ర యాదగిరి, టి.మోహన్రెడ్డి, ఆనంద్యాదవ్, కేకేఎల్ గౌడ్, పారంద నర్సింగ్రావు, బాల్రాజ్ గౌడ్, విజయభాస్కర్ రెడ్డి, కొప్పుల వెంకట్రెడ్డి, రాంకోటి, కె.వెంకటాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి గెలుపుకోసం పార్టీ శ్రేణులు కృషిచేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం పార్టీ బీఎన్రెడ్డినగర్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రులు, కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న, డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి, మాదవరం నర్సింహారావు, అనిల్ చౌదరి, ఇందిరారెడ్డి, నాగమణిరెడ్డి, నిర్మలాదేవి, నరేందర్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
హయత్నగర్ డివిజన్లోని శారదానగర్, కమలానగర్, భూలక్ష్మీనగర్ కాలనీల్లో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, ఎన్నికల కోఆర్డినేటర్ ఒంటేరు గోపాల్రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ హయత్నగర్ డివిజన్ అధ్యక్షుడు గుడాల మల్లేశ్ ముదిరాజ్, నాయకులు ఘనపురం కృష్ణ, మారుతీ చాంద్, గణేశ్, తదితరులు పాల్గొన్నారు.