కంటోన్మెంట్, జూన్ 11:న్యూ బోయిన్పల్లిలోని ఆనంద్నగర్ నాలాలో పడి మృతి చెందిన ఆనంద్సాయి అనే బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆనంద్సాయి కుటుంబసభ్యులను ఆయన పరామర్శించి ఓదార్చారు. తక్షణ సాయంగా రూ.20 వేలు అందజేయడంతోపాటు రాష్ట్ర మంత్రి కేటీఆర్తో మాట్లాడి డబుల్ బెడ్ రూం వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పారు. కంటోన్మెంట్ ప్రాంతంలో దురదృష్ట సంఘటన జరగడం తనను ఎంతో కలిచివేసిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కంటోన్మెంట్ బోర్డు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం నాలా పరిసర ప్రాంతాన్ని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి పరిశీలించారు. బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్, సంతోష్యాదవ్, పనస సంతోష్, నివేదితా, సదానంద్గౌడ్తో పాటు బోయిన్పల్లి సీఐ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.