కంటోన్మెంట్/మారేడ్పల్లి, ఆగస్టు 25: నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఈ మేరకు బుధవారం ఐదో వార్డులోని కాకాగూడలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించడంతో పాటు రూ. 15లక్షల వ్యయంతో మొదటి అంతస్తు నిర్మాణానికి సంబంధించి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ నిర్మాణంతో బస్తీ వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. చిన్నపాటి శిక్షణా తరగతుల నిర్వాహణకు సామాజిక భవనం ఉండడంతో స్థానికులకు వరంలా మారిందని చెప్పారు. అదేవిధంగా కమ్యూనిటీ హాల్పైన మొదటి అంతస్తుకు సంబంధించి రూ.15లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టామని, త్వరలోనే పనులు పూర్తిచేసుకొని ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, డైరెక్టర్ మహంకాళి శర్విన్, బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్, నేతలు ముప్పిడి మధుకర్, నివేదిత, తేజ్పాల్, భాస్కర్, పనస సంతోష్, మురళీయాదవ్ తదితరులు పాల్గొన్నారు.