కంటోన్మెంట్, ఆగస్టు 3 : అర్హత ఉన్న అన్ని కుటుంబాలకు రేషన్ కార్డులను అందజేసి ఆహార భద్రత కల్పిస్తామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. బోర్డు పరిధిలోని బాలంరాయి, బోయిన్పల్లి, మోండా డివిజన్లోని రెజిమెంటల్బజార్, తిరుమలగిరి, బొల్లారం, రసూల్పురాలోని రేషన్ దుకాణాల వద్ద మంగళవారం వేర్వేరుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గానికి సుమారు 15వందలకు పైగా కొత్త కార్డులు మంజూరయ్యాయని, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఒక్కరు కూడా పస్తులుండకుండా, కడుపునిండా తినాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు. పేదలు సంతోషంగా ఉండేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, నళినికిరణ్, అనితాప్రభాకర్, సదా కేశవరెడ్డి, శ్యాంకుమార్, లోక్నాథంతో పాటు నేతలు ముప్పిడి మధుకర్, నివేదిత, పిట్ల నగేష్, పనస సంతోష్, సదానంద్గౌడ్, తేజ్పాల్, కుమార్ ముదిరాజ్, లతామహేందర్తో పాటు రేషన్ కార్డు లభ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.