శంషాబాద్ రూరల్, ఆగస్టు 31: ‘ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ప్రభుత్వం ఎందుకు స్పందించదు.. సీఎం ఏం చేస్తున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం తప్ప.. పాలన మీద దృష్టిలేకపోవడం విడ్డురంగా ఉంది’ అని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. సమస్యలు పరిష్కరించాలంటూ…రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలోని కస్తూర్బాగాంధీ హాస్టల్ విద్యార్థులు శుక్రవారం రోడ్డెక్కి నిరసన తెలిపిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శనివారం హాస్టల్ను మాజీ మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి సందర్శించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘హాస్టల్లో మా పిల్లలు ఇబ్బందులుపడుతున్నారు. మీరే చూడాల’ంటూ..విద్యార్థుల తలిఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ సీఎంకు పాలనపై దృష్టిలేద్లుదండ్రులు కోరగా, స్పందించిన హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి.. ‘మీకు మేమున్నాం..మీకేం కాదు.. సీ
ఎం రేవంత్రెడ్డి పాలన పూర్తిగా గాడితప్పింది. విద్యార్థులకే కాదు.. రాష్ట్ర ప్రజలకు కూడా ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతున్నది’ అని అన్నారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ‘మీ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా.. మాకు సమాచారం ఇవ్వాల’ంటూ.. సూచించారు. హాస్టల్లో వండుతున్న భోజనాన్ని రుచి చూశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ…
ఆడపిల్లలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎవరికీ చెప్పుకోవాలో తెలియక కిలోమీటర్ దూరం వెళ్లి..రోడ్డెక్కి ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే లోపం ఎక్కడ ఉన్నదో అర్ధమవుతున్నదన్నారు. కులం పేరుతో దూషిస్తున్నట్లు విద్యార్థులు కన్నీరుపెట్టుకోవడం బాధాకరమన్నారు. ఏదైనా అడిగితే కర్రలు విరిగేలా కొడుతున్నారని చెప్పినట్లు పేర్కొన్నారు. ఓ విద్యార్థి టీచర్ కొట్టిన దెబ్బలకు గాయమైన చేతిని చూపుతూ.. ఏడుస్తున్న తీరు కలిచివేసిందన్నారు. ‘ఇప్పటివరకు కేవలం ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు. మరో జత అడిగితే ఇవ్వడం లేదు. పుస్తకాలు సైతం ఇవ్వడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలు, కస్తూర్బాగాంధీ హాసళ్ల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది’ అని అన్నారు.
గతంలో కేసీఆర్ పాలనలో సన్నబియ్యంతో అన్నం పెడితే .. నేడు గొడ్డుకారం పెడుతున్నారు’ అని హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు వివిధ గురుకులాలకు చెందిన 500 మంది దవాఖాన పాలయ్యారు. 38 మంది పిల్లలు చనిపోయారు. పాములు కరిచి చనిపోతున్నారు. ఎలుకలు కొరికి దవాఖానలో చేరుతున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థుల పట్ల కించపరిచేలా మాట్లాడటం సరికాదు. పిల్లలు భయపడుతున్నారు.
ఇక్కడ ఉన్న టీచర్లను మార్చి కొత్తవారిని తీసుకొచ్చి.. పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాలి’ అని డిమాండ్ చేశారు. మైనార్టీ గురుకులాలకు జనవరి నుంచి మెస్ బిల్లులు ఇవ్వడం లేదు. రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో కాస్మోటిక్ చార్జీలు, కరెంట్ బిల్లలు ఇవ్వలేదు’ అని చెప్పారు. ఇప్పటికైనా సీఎం పాలనపై దృష్టి పెట్టి సమీక్షలు చేసి విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టల్ను సందర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకుడు కార్తిక్రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ సతీశ్ తదితరులు ఉన్నారు. అలాగే హాస్టల్ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మా పిల్లలను చదువుకోవడానికి పంపిస్తే వారికి చదువు చెప్పడం మానేసి.. వేధింపులకు గురి చేయడం మంచిదికాదు. దుస్తులు ఇవ్వడంలేదు. మంచి అన్నం పెట్టమంటే కులం పేరు పేరుతో దూషించడం ఏమిటి. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు.
-లావణ్య, విద్యార్థిని తల్లి ఏం జరిగినా..
మా పిల్లలకు ఏం జరిగినా ఉపాధ్యాయులదే బాధ్యత. మేం పేదోళ్లం అందుకే హాస్టల్లో వేసినం. మా కులం పేరుతో దూషించడం మంచిది కాదు. చదువుకున్నోళ్లు అనే మాటలేనా.. ఉపాధ్యాయులను పూర్తిగా మార్చివేసి.. మా పిల్లలకు న్యాయం చేయాలి.
-కుమార్, విద్యార్థిని తండ్రి
హాస్టల్లో విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలంటూ.. ఆందోళనకు దిగిన విషయం తెలుసుకొని వెంటనే డీఈవో శశీధర్రావు హాస్టల్ను సందర్శించి.. మాకు ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్లో స్టాఫ్ను పూర్తిగా మార్చినం.
-సుజాత, జీసీడీవో(గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ అఫీసర్)