మణికొండ, నవంబర్ 10 : మీ బిడ్డగా.. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ జీవితం ప్రజాసేవకే అంకితమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. శుక్రవారం మైలార్దేవ్పల్లిలోని ఆయన నివాసం నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గులాబీ శ్రేణులతో ఆయన భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ రెండో సెట్ను రిటర్నింగ్ అధికారికి దాఖలు చేశారు. మైలార్దేవ్పల్లి నుంచి ఉప్పర్పల్లిలోని ఆర్వో కార్యాలయం వరకు సాగిన ర్యాలీలలో వేలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బ్యాండు భాజాలతో తరలిరావడంతో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ఆనంద భాష్పాలను చిందించారు. కాంగ్రెస్,బీజేపీ లాంటి పార్టీలకు రాజేంద్రనగర్లో స్థానం లేదన్నారు. తాను చేసిన అభివృద్ధి అడుగడుగునా ప్రజలు గుర్తిస్తున్నారని అసత్య ఆరోపణలు, బూటకపు సోషల్మీడియా పోస్ట్లు నా గెలుపును ఆపలేవన్నారు.