శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 16 : ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి కరోనా టీకా వేయించుకోవాలని ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. గురువారం మండలంలోని జూకల్ గ్రామంలో సర్పంచ్ కోడూరి నర్సమ్మ అధ్యక్షతన కరోనా టీకా ప్రత్యేక క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందికి రెండు డోసులు పూర్తి చేశామని వివరించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ టీకాలు వేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి గ్రామంలో ఇంటింటా తిరిగి టీకాలు వేసేందుకు ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్శాఖ అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు.
ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ నీరటి తన్విరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఎల్పీవో అన్నపూర్ణ, వైస్ ఎంపీపీ నీలంనాయక్, ఎంపీడీవో వినయ్కుమార్, ఎంపీవో సురేందర్రెడ్డి, ఉప సర్పంచ్ మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, పెద్దషాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు రమ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దండు ఇస్తారి, సర్పంచ్ రాజ్కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్రావు, మాజీ ఎంపీటీసీ మోహన్నాయక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ శేఖర్రెడ్డి, నాయకులు సత్యానందం, హేమ్లానాయక్, వెంకటేశ్, మైలారం భిక్షపతి, తాళ్ల శ్రీనివాస్గౌడ్, జుర్కి రమేశ్ పాల్గొన్నారు.
అత్తాపూర్, సెప్టెబంర్ 16 : సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. అత్తాపూర్ డివిజన్ హైదర్గూడకు చెందిన లక్ష్మమ్మకు రూ. 2. 25 లక్షల సీఎం రిలీఫ్ఫండ్ చెక్కును బాధితురాలి భర్త వెంకటేశ్కు గురువారం అందజేశాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ఫండ్తో పేదల ఆరోగ్య భద్రత కు ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని చెప్పారు. ఇది పేద ప్రజలకు వరమన్నారు. అనంతరం అత్తాపూర్ డివిజన్లోని మణికంఠ భక్త సమాజంఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారం భించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు సురేందర్రెడ్డి, అమరేందర్, డివిజన్ అధ్యక్షుడు శ్రీరాంరెడ్డి, కో ఆర్డినేటర్ శ్రీధర్రెడ్డి, శ్రీనివాస్, మహేశ్, సత్యనారాయణ, ఏసీపీ సంజయ్కుమార్, ఇన్స్పెక్టర్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.