బండ్లగూడ, ఆగస్టు 2 : తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం పండుగలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అన్ని డివిజన్ల వారీగా బోనాల పండుగ సందర్భంగా సోమవారం ఆలయాల ముస్తాబు కోసం ప్రభుత్వం తరుఫున వచ్చిన చెక్కులను కమిటీ సభ్యులకు అందజేశారు. మొత్తం 57 ఆలయాలకు రూ.16లక్షల 51 వేల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. అదేవిధంగా దేవాలయాల ముస్తాబుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో మోహన్రావు, మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్గౌడ్, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.
శంషాబాద్ రూరల్: మండలంలోని చిన్నగోల్కొండ గ్రామ పంచాయతీ పరిధిలోని సంఘిగూడలో చిన్నగోల్కొండ గ్రామానికి చెందిన గుర్రం అనంతరెడ్డి తన సొంత ఖర్చులతో నూతన దేవాలయం(మైసమ్మ ఆలయం) నిర్మాణం చేశారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో శంషాబాద్ ఎంపీపీ దిద్యాల జయమ్మశ్రీనివాస్, పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డితో పాటు పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
శంషాబాద్ రూరల్: గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. సోమవారం శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ టీఆర్ఎస్ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి ఆయన చేతుల మీదగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీలతో పాటు కార్యకర్తలే కీలకమని వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు గ్రామస్థాయిలో అందుతున్న తీరును తెలుసుకొని అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు చేరే విధంగా కృషి చేయాలని సూచించారు. కార్యకర్తలు, నాయకుల కృషితోనే పార్టీ గ్రామీణస్థాయి నుంచి బలోపేతంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్రావు, మాజీ సర్పంచ్ సత్యనారాయణగౌడ్, గాదె రాజశేఖర్, మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్తో పాటు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నర్సింహ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా గౌస్పాషా, యూత్ అధ్యక్షుడిగా పొతుగల్ల జేమ్స్, సలహాదారులుగా గాదె రాజశేఖర్, సత్యనారాయణగౌడ్, రఘువీర్ పండిత్, ఏదయ్గౌడ్, బి.శేఖర్, కపిల్దేవ్, శ్రీధర్గౌడ్ను నియమించినట్లు మాజీ సర్పంచ్ డి.సత్యనారాయణగౌడ్ తెలిపారు.
వ్యవసాయ యూనివర్సిటీ: తెలంగాణ ప్రభుత్వం యువత ఉపాధికి ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని సులేమాన్ నగర్లో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రాధాన్యతను బట్టీ అభివృద్ధి చేస్తుందని, సాగు.. తాగు నీరు, విద్యుత్ ఉపాధికల్పనకు ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. యువకులు ఏదేని రంగంలో ప్రావీణ్యత పొంది ఉపాధి పొందడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో షేక్ నయీముద్దీన్, జహంగీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.