మల్కాజిగిరి, నవంబర్ 2: బస్తీల్లో కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం అల్వాల్ డివిజన్, రాజీవ్ వీకర్ సెక్షన్లో రూ.10లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. బస్తీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సదుపాయాలు కల్పించామని అన్నారు. ఇంటింటికి సర్వే చేసి అర్హులైన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులను గుర్తించి వారి కి పింఛన్ అందేలా కృషి చేస్తున్నామని అన్నారు. మహిళలు స్వయం ఉపాధి పొందడానికి ఉచితంగా కుట్టు శిక్షణ ఇస్తున్నామన్నారు. అవకాశాలను బస్తీ వాసులు వినియోగించుకోవాలని అన్నారు. బస్తీల్లో కమ్యూనిటీ హాళ్లను నిర్మించడం వల్ల శుభకార్యాలు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నాగమణి, డీఈ మహేశ్, కొండల్రెడ్డి, ఆనంద్, ఉదయ్కుమార్, లక్ష్మికాంతరెడ్డి, రాజు, రవి, వెంకటేశ్గౌడ్, అక్రమ్, పాషా, అఫ్జల్, నాగేశ్వరరావు, ప్రవీణ్కుమార్, మధు, శ్రీనివాస్, జ్యోతి, కవిత, బబిత, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.