మల్కాజిగిరి, అక్టోబర్ 19: పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం మల్కాజిగిరి సర్కిల్ పార్టీ కార్యవర్గాన్ని ప్రకటించి.. వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంతి కేసీఆర్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేయాలని అన్నారు. పార్టీ కోసం పనిచేసేవారికి గుర్తింపు ఉంటుందని అన్నారు. మల్కాజిగిరి సర్కిల్ అధ్యక్షుడిగా పిట్టల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా సాయిగౌడ్, మహిళ అధ్యక్షురాలిగా గద్వాల్ జ్యోతి, ప్రధాన కార్యదర్శిగా స్వాతి, బీసీ సెల్ అధ్యక్షుడిగా సాయిగౌడ్, ప్రధాన కార్యదర్శిగా సతీశ్కుమార్, యూత్ సెల్ అధ్యక్షుడిగా ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా ఆకాశ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా కృష్ణ, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా కాశప్ప, మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా నయీమ్ఖాన్, ప్రధాన కార్యదర్శిగా షోబీ అహమ్మద్, కార్మిక విభాగం మహమ్మద్ ఉస్మాన్, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ జాన్బీను నియమించారు.
మల్కాజిగిరి, అక్టోబర్ 19: టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం అల్వాల్ సర్కిల్ టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా కొండల్రెడ్డి, కార్యదర్శిగా బలవంతరెడ్డి, మహిళ అధ్యక్షురాలిగా జ్యోతియాదవ్, కార్యదర్శిగా మాధవి, బీసీ సెల్ అధ్యక్షుడిగా శేఖర్గౌడ్, కార్యదర్శిగా సుభాష్ముదిరాజ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ప్రవీణ్, కార్యదర్శిగా నర్సింగరావు, మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఇసాక్ఖాన్, కార్యదర్శిగా షఫీ, యూత్ అధ్యక్షుడిగా అరవింద్, కార్యదర్శిగా అశ్విన్నాయుడు, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఆనందరావు, కార్యదర్శిగా పవన్కల్యాణ్ను ప్రకటించి..అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే అభినందించారు.