చిక్కడపల్లి, జూన్ 6 : హుస్సేన్ సాగర్ నాలా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతగా కొనసాగుతునన్నాయని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. మంగళవారం గాంధీనగర్ డివిజన్ సబర్మతినగర్లో జరుగుతున్న నాలా ప్రహరీ నిర్మాణ పనులన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలా నిర్మాణంలో పేదల ఇండ్లకు నష్టం వాటిల్లకుండా నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. నాలా రిటైనింగ్ వాల్ నిర్మాణం వలన పనులు దాదాపు పూర్తి అయ్యాయని తెలిపారు. హుస్సేన్సాగర్ పరీవాహక బస్తీ ప్రజల ఇండ్లకు నష్టం కలుగకుండా రిటైనింగ్వాల్ నిర్మించడం జరుగుతుందని తెలిపారు. గతంలో వర్షం వచ్చిన నాలాలో వరద నీరు పెరిగిన నాలా పరీవాహక బస్తీ ప్రజ లు తీవ్ర భయాందోళనకు గురయ్యావరని తెలిపారు. ప్రహరీ నిర్మించడంతో ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కరించడం జరిగిందన్నారు. నాలా రిటైనింగ్ వాల్ పనులు చివరి దశలో ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం ముఠా జయసింహ, అదికారులకు ఈఈ ప్రవీణ్, ఏఈ శ్యామ్ సుందర్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాకేశ్కుమార్, ముచ్చకుర్తి ప్రభాకర్, ముఠా నరేశ్, శ్రీనివాస్ గుప్తా, జీవై గిరి, నర్సింగ్ ముదిరాజ్, ఎండీ గౌస్, శ్రీధర్రెడ్డి, ఆనంద్, చందు, చాణిక్యరెడ్డి తదితరలు పాల్గొన్నారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ మాదిరి ప్రశ్నాపత్రాలు పంపిణీ..
టీఎస్పీఎస్ జూన్ 11న నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు యూపీఎస్సీ యూనివర్స్ మాదిరి ప్రశ్నాపత్రాలను మంగళవారం అశోక్నగర్లోని ఉచితం గా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రశ్నాపత్రాలను పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం 80వేలకు పైగా ఉద్యోగాలకు నోటఫికేషన్ ఇవ్వడం జరిగిందని. అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి వలన నేడు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలిపారు. కేపీ సర్ యూపీఎస్సీ యూనివర్స్ చైర్మన్ కృష్ణ ప్రదీప్, గతంలో జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ రైద్దెన నేపథ్యంలో నిరుద్యోగ యువతకు అండగా నిలవాలనే సంకల్పంతో మాదిరి ప్రశ్నాపత్రాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ యుజవన విభాగం నాయకుడు ముఠా జయిసింహ, ముచ్చకుర్తి ప్రభాకర్, శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బోర్వెల్ పనులు ప్రారంభం ..
బాగ్లింగంపల్లి లంబాడితండా డబుల్ బెడ్రూంల భవనం వద్ద మంగళవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆర్వో ప్లాంట్ ఏర్పాటు కోసం భూమి పూజ నిర్వహించి బోర్వెల్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్వో ప్లాంట్ ఏర్పాటు ద్వారా ప్రజలకు మినరల్ వాటర్ను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బస్తీ అధ్యక్షుడు కల్యాణ్నాయక్, దేవేందర్నాయక్, హరి, బాలు తదితరులు పాల్గొన్నారు.