చిక్కడపల్లి/కవాడిగూడ, మే 23: ప్రజా సమస్యలను శాశ్వతంగా పరిష్కరిచే దిశగా చర్యలు తీసుకోవడంతో పాటు నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్లో మంగళవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, డీఈ గీత, ఏఈ అబ్దుల్ సలాం, వాటర్వర్క్స్ మేనేజర్ కృష్ణమూర్తితో కలిసి పర్యటించారు. బాపునగర్, ఎస్సార్టీ, టీఆర్టీ, లక్ష్మీగణపతి లేన్ నర్మద దవాఖాన, శాంతి యువజన సంఘం బస్తీ తదితర బస్తీ, కాలనీల్లో ద్విచక్ర వాహనంపై పర్యటించి ప్రజా సమస్యలను ప్రజలతో అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే దిశ చర్యలు తీసుకుంటున్నామని, ప్రజా సమస్యల పరిష్కరానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. వీడీసీసీ రోడ్లు, సీవరేజీ, తాగునీటి సమస్యలు సత్వరం పరిష్కరించాలని అధికారుకు ఆదేశించారు. శాంతినగర్ యువజన సం ఘం బస్తీలో స్థానికుల అభ్యర్థన మేరకు బస్తీ దవాఖాన ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు రాకేశ్, ముఠా నరేశ్, ముచ్చకుర్తి ప్రభాకర్, గుండు జగదీశ్బాబు, శ్రీనివాస్ గుప్తా, పున్న సత్యనారాయణ, రవిశంకర్గుప్తా, గడ్డమీది శ్రీనివాస్, రాంచందర్, అశోక్, ఆకుల శ్రీనివాస్, ప్రేమ్, వెంకటేశ్, జీవై గిరి, బోనం బన్నీ, జహంగీర్, భాస్కర్రెడ్డి, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను పూర్తి చేయాలి
డివిజన్లో నూతన రోడ్ల ఏర్పాటుతో పాటు డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కవాడిగూడ డివిజన్లోని జీహెచ్ఎంసీ క్వార్టర్స్, పూల్బాగ్, అడ్వకేట్ కాలనీ, బండానగర్, చిత్రాల్నగర్, ఉన్నికోట, కొత్తబజార్, మల్లయ్య హోటల్ లైన్ తదితర ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆయన పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. డివిజన్లో పాతరోడ్లు ఉన్నచోట కొత్తరోడ్ల ఏర్పాటు, ఆయా ప్రాంతాల్లో లీకేజీ అవుతున్న డ్రైనేజీ పనులను త్వరితగతిన చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా పెండింగ్లో ఉన్న అభివృద్ధి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని, డివిజన్లో ఎక్కడ ఎలాంటి సమస్యలున్నా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని బస్తీ వాసులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, జీహెచ్ఎంసీ డీఈ సన్నీ, కవాడిగూడ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.