ముషీరాబాద్ / కవాడిగూడ / చిక్కడపల్లి, అక్టోబర్ 9: డివిజన్లో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం భోలక్పూర్ డివిజన్లోని కృష్ణానగర్లో రూ. 5 లక్షల వ్యయంతో డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన కార్పొరేటర్ గౌసొద్దీన్ తహ, బీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహ, భోలక్పూర్ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్రావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డివిజన్లో కోట్లాది రూపాయల నిధులతో తాగునీటి, డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణ పనులు చేపట్టి ప్రజల సమస్యలను తీర్చామని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ ఏ సమస్య ఎదురైనా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్, ఎ. శంకర్ గౌడ్, ఆర్. శ్రీనివాస్, జబ్బార్, మక్బూల్, ప్రవీణ్, శ్రీకాం త్ ముదిరాజ్, బస్తీ వాసులు లతీఫ్, యాదగిరి పాల్గొన్నారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలో గత ఐదేళ్లలో అమ లు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి నినాదంతో ఎన్నికల బరిలో ముందుకుసాగనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముఠా గోపాల్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న పటిష్ట క్యాడర్, చేసిన పనులు, ప్రజా మద్దతుతో త్వరలో జరిగే ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించబోతున్నట్లు చెప్పారు. సోమవారం ఆయన ముషీరాబాద్ డివిజన్ కమిటీ బలు బస్తీల్లో రూ.50 లక్షల వ్యయం తో చేపట్టనున్న డ్రైనేజీ, మంచినీటి పైపులైన్ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ ఎన్ సుప్రియా గౌడ్తో కలిసి ప్రారంభించారు. అనతరం మాట్లాడుతూ.. నిత్యం ప్రజల మధ్య ఉంటూ, వారితో నేరుగా సత్సంబంధాలు కలిగిఉన్న తన పట్ల నియోజకవర్గం ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. ఎంతో మంది నేరుగా కలిసి మత బస్తీలు, కాలనీల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తున్నారని, వారి సమస్యలు పరిష్కరించి మన్ననలు పొందుతున్నట్లు తెలిపారు. ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడం జరిగిందని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు విబేధాల కు తావులేకుండా కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, శ్రీధర్రెడ్డి, ఆకుల అరుణ్కుమార్, ఎయిర్టెల్ రాజు, బి. శ్రీనివాస్, భాస్క ర్, శివ ముదిరాజ్, శ్రీకాంత్ గౌడ్, గోవింద్, శ్రీధర్చారి తదితరులు పాల్గొన్నారు.
గడిచిన ఐదు సంవత్సరాల్లో నియోజవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్లో డివిజన్లో మూడు చోట్లకు సంబంధిచిన రూ. 67 లక్షల వ్యయంతో వీడీసీసీ రోడ్డు, ప్యాచ్ వర్క్ పనులను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. నియోజకవర్గం పరిధిలో కోట్లాది రూపాయిలతో ప్రజలకు మౌలిక వసత లు కల్పించడంతో పాటు, పార్కులను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. నియోజరవ్గంలో గతంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండేదని, రోడ్లను అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్కుమార్, జీహెచ్ఎంసీ డీఈ గీత, ఏఈ అబ్దుల్ స లాం, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎం. రాకేశ్కుమార్, ముఠా నరేశ్, ఎర్రం శ్రీనివాస గుప్తా, గడ్డమీది శ్రీనివాస్, శ్రీకాంత్, సత్యనారాయణ, బత్తుల కిరణ్కుమార్, ఎస్టీ ప్రేమ్, ఆనంద్, భాస్కర్రెడ్డి, రాజ్కుమార్, దేవయ్య, చందు, వెంకటేశ్, జహంగీర్, కుమార్, బీజేపీనాయకులు వినయ్కుమార్ రత్నసాయిచంద్, పాల శ్రీనివాస్, సురేందర్, జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ మహేశ్ పాల్గొన్నారు.